Tuesday, May 8, 2018

India - actions for Gadchiroli massacre -PCI ( MAOIST)



గడ్చిరోలీ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకుంటాం..మావోయిస్టు పా

గడ్చిరోలీ పోలీసు హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా రేపన్ పల్లి అటవీ ప్రాంతంఓ పాటు దక్షిణ గడ్చిరోలీ ప్రాంతమంతా బ్యానర్లు కట్టారు, చెట్లకు పోస్టర్లు అంటించారు. సీపీఐ మావోయిస్టు పార్టీ దక్షిణ గడ్చిరోలీ కమిటీ పేరుతో చెట్లకు కట్టిన ఈ బ్యానర్లలో 40 మంది అమరవీరుల చిందించిన నెత్తురుకు ప్రతీకారం తీర్చుకుంటామని, పోలీసులకు సహకరించిన ద్రోహులకు కూడా బుద్ది చెబుతామని హెచ్చరించారు.

మరోవైపు మహారాష్ట్ర పోలీసులు మరో దుర్మార్గానికి ఒడిగట్టారు. ఐదుగురు మావోయిస్టు నేతలను పట్టిస్తే కోటీ 60 లక్షల రూపాయలు ఇస్తామని మహారాష్ట్రలోని అన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి చెందిన అమరుడు మల్లోజుల కోటేశ్వర్ రావు ఎలియాస్ కిషన్ జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ తలపై 60 లక్షలు, మిలింద్ తేల్టుంబ్డే కు 50 లక్షలు, నర్మదక్క ఎలియాస్ అలూఱి ఉషారాణికి 25 లక్షలు, జోగన్న 20 లక్షలు, పహాడ్ సింగ్ కు 16 లక్షలు ప్రకటించారు.
( Source:newindianexpress.com/nation/2018/may/04/reds-vow-revenge-for-gadchiroli-encounter-1810080.html)

No comments:

Post a Comment